ఈటల ఢిల్లీ పర్యటన పై కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు.. ?

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయట.

ఎన్నో తర్జభర్జనల మధ్య, ప్రజల్లో నెలకొన్న ఊహాగానాలకు పొలిస్టాప్ పెట్టేలా ఈటల నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న విష‌యం తెలిసిందే.

మరో వైపు ఈటల తమ పార్టీలో చేరుతామంటే అభ్యంతరం లేదని కాంగ్రెస్ కూడా ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.అయితే గులాభిదండును ఎదుర్కోవాలంటే ప్రస్తుత పరిస్దితుల్లో కాంగ్రెస్ కంటే బీజేపీనే బెటర్ అని భావించిన ఈటల రాజేందర్, కమళం కండువా కప్పుకోవడానికి సిద్దపడినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ఈటల మా పార్టీలో చేరడం పై ఎలాంటి అభ్యంతరం లేదని.

త‌మ పార్టీలో ఈటల చేరికను త‌మ పార్టీ నేత‌లంతా స్వాగతిస్తున్నారని తెలిపారు.కాగా సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తి గురించి పార్టీలో చర్చిస్తామని పేర్కొన్నారు.

Advertisement
సురేష్ ప్రొడక్షన్ మూవీలను రిలీజ్‌కి ఒక రోజు ముందే థియేటర్లలో వేస్తారట..??

తాజా వార్తలు