గత సంవత్సరం కెజిఎఫ్ సినిమా తో కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.
యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఏడు భాషల్లో రిలీజ్ అయిన మొట్టమొదటి కన్నడ చిత్రం గా చరిత్ర సృష్టించింది.
అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న మొట్టమొదటి కన్నడ చిత్రంగా రికార్డులు కెజిఎఫ్ సృష్టించింది.ప్రస్తుతం ఈ దర్శకుడు కెజిఎఫ్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించడానికి ఉన్నాడు.
ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించడానికి సిద్ధమవుతున్నాడని టాక్ టాలీవుడ్ లో గత కొంతకాలంగా వినిపిస్తుంది.అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియలేదు.
ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ లో బడా నిర్మాతలుగా గుర్తింపు పొందిన మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది.కెజిఎఫ్ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం.
అయితే తెలుగులో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరో ఎవరు నటిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy