ఈ భారత ఎన్నారై సుడి మాములుగా లేదుగా...!!!!

దేశం కాని దేశంలో తమ లక్కు ఎలా ఉందొ పరీక్షించుకుందామని అనుకున్న ఓ ఎన్నారై లాటరీ టిక్కెట్టు కొన్నాడు.

అయితే ఆ తరువాత ఆ విషయాన్ని మర్చి పోయాడు.

తీరా చూస్తే అతడు కొన్న టిక్కెట్టుకే లక్కు వరించింది.వస్తుందో లేదో అనుకున్న అతడి కోరిక నెరవేరింది.

దాదాపు 18 కోట్ల రూపాయలు తలుపు తట్టాయి.ఇంకేముందు ఇప్పుడు అతడు కోటీశ్వరుడు అయ్యాడు.

ఒక్క సారి ఆ ఎన్నారై కి ఈ లక్కు ఎలా చిక్కిందనే వివరాలలోకి వెళ్తే.

Advertisement

షార్జా లో డిజైనర్ గా పని చేస్తున్న కేరళాకి చెందిన సంజయ్‌నాథ్‌ అనే ఎన్నారై , తన స్నేహితులతో కలిసి మే నెలలో లాటరీ టిక్కెట్టు కొన్నాడు.ఆ తరువాత టిక్కెట్టు ఫలితాలు పట్టించుకోలేదు.అయితే తన స్నేహితులు ఆ లిస్టు లో ఎవరెవరు గెలుపొందారో చూసుకోగా తన స్నేహితుడి పేరు ఉండటం చూసి ఉబ్బితబ్బిబ్బైయ్యారు.

వెంటనే ఈ విషయాన్ని చెప్పడానికి అతడికి ఫోన్ చేయగా.ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని వచ్చింది.అందరూ అతడికి మెసేజ్ లు చేశారు.

చాలా సేపటికి అతడు ఫోన్ ఆన్ చేయగానే వరుసగా వచ్చిన మెసేజ్ లు చూసి షాక్ అయ్యాడు.నువ్వు 18 కోట్లు గెలుచుకున్నావ్ అని చూడగానే ఒక్క సారిగా అతడి ఎగిరి గంతేశాడు.

అయితే ఈ పెద్ద మొత్తం సామాజిక సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తానని తెలిపారు.తన సన్నిహితులతో ఈ సతోషం పంచుకుంటానని అన్నారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు