కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఇవ్వండి! ఎన్నికల ప్రచారంలో కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కరీంనగర్ లో తన లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు.

ఈ సభలో కార్యకర్తలు, ఓటర్లని ఒద్దేశించి ప్రసంగించిన కేసీఆర్ కీలక వాఖ్యలు చేసారు.

థర్డ్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పబోతుంది అని, తనకి ఇప్పటికే వంద మంది ఎంపీల సపోర్ట్ ఉందని చెప్పుకొచ్చారు.తాను కేంద్రంలో పని చేసే అవకాశం తెలంగాణ ప్రజలు ఇవ్వాలని కోరారు.

ఈ లోక్ సభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి 16 సీట్లు కట్టబెట్టితే కేంద్రంలో మన పార్టీ కీలకం అవుతుందని చెప్పుకొచ్చారు.తెలంగాణని అభివృద్ధిలో తీసుకెళ్తూ ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అడ్డుపడుతు వస్తున్నారని, రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో తాను ఎక్కడ ఓడిస్తానేమో అనే భయంతో మూడు నెలలుగా మూడు వేల సార్లు తనని తిట్టాడని, తెలంగాణ సాధించి తీరుతా అని చెప్పిన అప్పట్లో తనని బాబు హేళన చేసారని అన్నారు, 20 ఏళ్ల క్రితం ఎక్కడైతే తెలంగాణ తెస్తా అని ప్రమాణం చేసానో మళ్ళీ ఇప్పుడు ఆ కరీంనగర్ కి వచ్చి మాట్లాడుతున్నా అని అన్నారు.

ఈ లోక్ సభ ఎన్నికలు కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ, అలాగే తెలంగాణ ప్రజల డిమాండ్లు నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తుందని అన్నారు.

Advertisement
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

తాజా వార్తలు