కన్నడలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కేజీఎఫ్’ పాన్ ఇండియా మూవీగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించి మాస్ యాక్షన్ను సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు ఈ డైరెక్టర్.ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్తో కన్నడ హీరో యశ్ ఒక్కసారిగా ఇండియన్ స్టార్ అయిపోయాడు.
ప్రస్తుతం కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్గా కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్.ఈ సినిమాను కూడా కేజీఎఫ్ లాగా పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనే ప్రశ్నకు తాజాగా తెరదించాడు ఈ డైరెక్టర్.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ను ‘సలార్’గా చూపించేందుకు పక్కా ప్రణాళిక రచిస్తున్నాడు.
దీంతో ఈ సినిమాను అనౌన్స్ చేసిన కొద్దిసేపటికే ఈ సినిమాపై నేషన్వైడ్గా ట్రెండింగ్ మొదలైంది.దీంతో ప్రశాంత్ నీల్ పేరు కూడా జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది.
అయితే కన్నడ ప్రేక్షకులు మాత్రం ప్రశాంత్ నీల్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.కన్నడ హీరోతో స్టార్డమ్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు కన్నడ హీరోలను కాదని తెలుగు హీరోలతో సినిమాలు చేయడం ఏమిటని వారు ప్రశ్ని్స్తున్నారు.
మొత్తానికి సలార్ చిత్రం అనౌన్స్మెంట్ కేవలం ట్రెండింగ్లోనే కాకుండా ప్రశాంత్ నీల్పై ట్రోలింగ్ను కూడా అంతే ట్రెండింగ్లో ఉంచారు.ఇక ఈ సినిమాను 2021 ద్వితీయార్థంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు.మరి ప్రభాస్ కోసం ఆయన ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడు, ప్రభాస్ను ఆయన ఎలా చూపించబోతున్నాడు అనే అంశాలు తెలియాలంటే మాత్రం సలార్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.