అక్కడ కంగనా చీరలు వచ్చేసాయి... ఎగబడికొంటున్న జనాలు...!

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఒక సంచలనంగా మారింది.ప్రస్తుతం ఆయన ఆత్మహత్య కాస్త రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది.

సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్ కంగనా రనౌత్ ఒక్కటి ఒక పక్కన, మిగతా బాలీవుడ్ మొత్తం ఒక పక్క అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.అంతేకాదు సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో కంగనా రనౌత్ మహారాష్ట్ర సర్కారు తీరును తప్పు పట్టడంతో ఆమెకు భారతదేశవ్యాప్తంగా నీరాజనం పడుతున్నారు ప్రజలు.

బాలీవుడ్ పరిశ్రమలో నెపొటిజం ఎక్కువైందని, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారిని ఒక వర్గానికి చెందిన వారు పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.వీటితో పాటు బాలీవుడ్ పరిశ్రమలో వారసత్వం ద్వారా వచ్చిన తారలపై కూడా ఆమె పెద్ద ఎత్తున మండిపడింది.

ఈ నేపథ్యంలో కంగన రనౌత్ కు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది.ఎవరైనా బాగా ప్రాముఖ్యం చెందితే వారిని ఎలాగైనా ఉపయోగించుకుంటారు మన భారతీయులు.

Advertisement

ప్రస్తుతం కంగనా ను కూడా అదే విధంగా ఉపయోగించుకుంటున్నారు భారతదేశ వ్యాపారస్తులు.అదెలా అంటే.

కంగనా కు ఉన్న క్రేజ్ ను ఉపయోగించి వస్త్ర వ్యాపారులు కరీనా చీరలు, కత్రినా చీరలు లాగా ప్రస్తుతం కంగనా చీరలు అంటూ మార్కెట్లోకి చీరలను తీసుకువస్తున్నారు.సూరత్కు చెందిన వ్యాపారులు కొత్త విధంగా ఆలోచించి కంగనా కు ఉన్న క్రేజ్ ను ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు.

ఇందుకు సంబంధించి కంగనా చీరల పేరుతో మార్కెట్లోకి విడుదలైన చీరలపై మణికర్ణిక సినిమాలోని కంగనా ఫోటోను ముద్రించారు.అంతేకాదు ఆ చీరలో ఐ సపోర్ట్ కంగనా అంటూ ప్రింట్ చేయబడింది.

దీంతో ప్రస్తుతం ముంబై మార్కెట్లోకి వచ్చిన ఈ చీరలను ముంబై మగువలు ఎగబడి కొంటున్నారు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు