తమిళనాడులో తన పార్టీ అభ్యర్ధులని ప్రకటించిన కమల్ హసన్

ఏపీ రాజకీయాలు సినిమా నటులతో ఎంత హడావిడిగా ఉంటుందో తమిళనాడు రాజకీయాలలో కూడా సినిమా నటుల భాగస్వామ్యం మొదటి నుంచి ఉంది.

తమిళనాడుని ఎక్కువ కాలం ఏలిన ఇద్దరు నేతలు జయలలిత, కరుణానిధి సినిమా నేపధ్యం ఉన్నవారే.

ఇదిలా ఉంటే వారు చనిపోయి ఖాళీగా ఉన్న సినిమా గ్లామర్ పోలిటిక్స్ లోకి కొత్తగా కమల్ హసన్, రజినీకాంత్ ఎంట్రీ ఇచ్చారు.అయితే ఇప్పటికే రజినీకాంత్ లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడం లేదని ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమా గ్లామర్ నుంచి వచ్చిన స్టార్ హీరో కమల్ హసన్ మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు.మొన్నటి వరకు అభ్యర్ధులపై తీవ్ర కసరత్తు చేసిన కమల్ హసన్ తాజాగా 22 మంది లోక్ సభ అభ్యర్ధుల జాబితాని ప్రకటించాడు.

ఈ జాబితాలో కమల్ హసన్ పేరు మాత్రం లేదు.అయితే తాను పోటీ చేసేది లేనిదీ 24 తేదీన స్పష్టత ఇస్తా అని కమల్ హసన్ చెప్పుకొచ్చారు.

Advertisement
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

తాజా వార్తలు