కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.

కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్  హాజరయ్యారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం కాళోజీ చిత్ర పటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్, డీవైఎస్ఓ రాములు, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాజన్న ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
Advertisement

Latest Rajanna Sircilla News