జియో నుంచి వస్తున్న మరో ఉచిత ఆఫర్ .. మిస్ చేసుకోకండి

అంబానీ అధ్వర్యంలోని జియో భారతదేశంలోని మొబైల్ డేటా వ్యాపారాన్ని శాసిస్తోంది.

కేవలం 4జి నెట్వర్క్ సర్వీసులపై 10 కోట్లకు పైగా కస్టమర్స్‌ ని రాబట్టున్న సంస్థ ప్రపంచం మొత్తంలో జియో ఒక్కటే.

ప్రస్తుతం ధనాధన్ ఆఫర్ తో ఒక రిఛార్జీపై మూడు నెలల అన్ లిమిటెడ్ కాలింగ్ మరియు 4G సర్వీసులు అందిస్తున్న జియో, మరోసారి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తే ఆఫర్ ని ప్రకటించింది.అదేంటో చూడండి.

ఇది జియోఫై ఎక్చెంజ్ ఆఫర్.Jiofi అంటే తెలుసు కదా, జియో అందిస్తున్న హాట్ స్పాట్ రూటర్.

దీంట్లో జియో సిమ్ వేసుకోని, వైఫై ఆన్ చేసుకోని 2G, 3G మొబైల్స్ లో కూడా జియో ఇంటర్నెట్ ని వాడుకోవచ్చు.ఈ డివైస్ ఖర్చు కేవలం 1999 రూపాయలు.

Advertisement

ఇప్పుడు మీకు ఇది పూర్తి ఉచితంగా దొరికే అవకాశం ఉంది.ఎలాగో తెలుసుకోవాలా? చాలా సింపుల్ అండి, మీరు ప్రస్తుతం వాడుతున్న డొంగిల్, వైఫై రూటర్ ఏదైతే ఉందో, దాన్ని జియో కంపెనికి ఇచ్చి జియోఫై బాక్స్ తీసుకోవాలి.జియో ప్రైమ్ తీసుకోని, కనీసం 309 ప్యాక్ తో రీఛార్జీ చేసుకోవాలి.

అంతే మీకు 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద మీకు చెల్లించిన డబ్బు వాపస్ వస్తుంది.కాని మీరు వాడుతున్న డోంగిల్, రూటర్ మాత్రం వారికి ఇచ్చేయాల్సి ఉంటుంది.

ప్రిపేయిడ్, పోస్ట్ పేయిడ్ .రెండురకాల కస్టమర్స్ కి ఈ ఆఫర్ వర్తిస్తుంది.ఆఫర్ నచ్చిందా ? మీ డోంగిల్, రూటర్ ఇవ్వటం ఇష్టం లేకపోతే మాత్రం 1999 రూపాయలు పెట్టి డివైజ్ కొని, ఆ తరువాత ప్రైమ్ రీఛార్జీ, ప్యాక్ రిఛార్జీ చేసుకోవాల్సిందే.అన్నట్లు చెప్పడం మరచిపోయాం, మీరు ఎక్చెంజ్ ఆఫర్ పొందాలంటే మీ ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు