పొత్తుపై జనసేనాని క్లారిటీ..! టీడీపీలో ఫుల్ జోష్

టీడీపీతో జనసేన పొత్తుపై జనసేన పార్టీ అధ్యక్షుడు క్లారిటీ వచ్చేసింది.నిన్న జరిగిన రణస్థలం సభలో పవన్ పొత్తులపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో పుల్ జోష్ కనిపిస్తోంది.ఏపీలో రానున్న ఎన్నికల్లో పొత్తులతోనే పోటీకి దిగుతామని పవన్ చెప్పారు.

పొత్తు గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.లేని పక్షంలో ఒంటరిగానే పోటీ చేస్తానన్నారు.

ఓట్లు చీలకుండా ఉండేందుకు, నియంతను సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ పార్టీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.టీడీపీతో అధికారంగా పొత్తు కుదరనప్పటికీ జనసేనాని వ్యాఖ్యలతో పొత్తులపై ఉన్న చిక్కుముడులు వీడుతున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

ఈ క్రమంలో కలిసి పని చేసేందుకు రోడ్డు మ్యాప్ తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాల్లో టీడీపీ, జనసేన కేడర్ కలిసి పనిచేస్తుంది.

అదేవిధంగా జిల్లా స్థాయిలోనూ ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలనే యోచన ఉందని సమాచారం.పవన్ కల్యాణ్ కు బాసటగా నిలుస్తూ వైసీపీ విమర్శలను తిప్పికొట్టేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు