అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ..!!

త్వరలో తిరుపతి పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరుపతి అభ్యర్థి విషయంలో క్లారిటీ తెచ్చుకోవడానికి పవన్ రెడీ అయ్యారు.

ఈ క్రమంలో ఇప్పటికే ఉప ఎన్నిక తేదీ కూడా ఖరారు కావడంతో పాటు ఆల్ రెడీ టిడిపి పార్టీ తరఫున ఎవరు నిలబడతారు అన్నదానిపై ఆ పార్టీ క్లారిటీ ఇవ్వటంతో.

  పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నిక విషయంలో జనసేన తరపున అభ్యర్థిని నిలబెట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.పంచాయతీ ఎన్నికలలో భారీ స్థాయిలో జనసేన పార్టీ స్థానాలు గెలవడంతో.

తిరుపతి ఉప ఎన్నిక లో జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టే రీతిలో అమిత్ షాతో పవన్ కళ్యాణ్ ఈనెల నాలుగవ తారీకు మంతనాలు జరపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈనెల నాలుగవ సాయంత్రం అమిత్ షా తిరుపతి పర్యటన చేపట్టనున్న తరుణంలో ఆ రోజు సాయంత్రం.

ఆయనతో భేటీ అవడానికి పవన్ రెడీ అయ్యారు.ఆ తర్వాత ఏపీ బీజేపీ నేతలతో సమావేశమయ్యే తిరుపతి అభ్యర్థి ఎవరు అన్నదానిపై చర్చించి ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

  .

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు