స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా, నిర్వాసితులకు అండగా జనసేన... పార్టీ జనరల్ సెక్రెటరీ తమ్మి రెడ్డి శివ శంకర్

విశాఖ: స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా, నిర్వాసితులకు అండగా జనసేన ఉంటుందని పార్టీ జనరల్ సెక్రెటరీ తమ్మి రెడ్డి శివ శంకర్ అన్నారు.

ఈరోజు ఉదయం వేపగుంట ప్రైవేట్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మొదటి నుంచి జనసేన పార్టీ స్టీల్ ప్లాంట్ కు అండగా ఉందని గుర్తు చేశారు.స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని, దాన్ని పరిష్కరించే వరకు జనసేన పార్టీ నిర్వాసితులకు అండగా ఉంటుందని శివశంకర్ పేర్కొన్నారు.

ఈ నెల 31వ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభావేదిక పై స్టీల్ ప్లాంట్ వ్యతిరేకం పై మాట్లాడతారు.జనసేన కార్యకర్తలు, వీర మహిళలు స్టీల్ ప్లాంట్ కు చేరుకొని స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా అధినాయకుడు చేసిన సభా వేదికను విజయవంతం చేయాలని శివ శంకర్ మీడియా ముఖంగా కోరారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు