సుభాష్‌ చంద్రబోస్‌ ఆపద ప్రబంధన్‌ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల జిల్లా : విపత్తు నిర్వహణలో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థల నుంచి సుభాష్‌ చంద్రబోస్‌ ( Subhash Chandra Bose )ఆపద ప్రబంధన్‌ పురస్కార్‌ అవార్డులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తుందని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ తెలిపారు.

జనవరి 23న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా విపత్తు నిర్వహణలో అద్భుతమైన పనితీరు కనబరచిన వ్యక్తులకు, సంస్థలకు భారత ప్రభుత్వం ప్రతి ఏటా అవార్డును అందిస్తుందని పేర్కొన్నారు.2024 సంవత్సరానికి గాను అవార్డుకు అర్హులని భావించిన వ్యక్తులు లేదా సంస్థలు అవార్డ్స్.గవర్నమెంట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.

Latest Rajanna Sircilla News