'RC15'పై లేటెస్ట్ అప్డేట్.. దానినే హైలెట్ చేయబోతున్న శంకర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన హీరోల్లో ఒకరిగా నిలిచారు.ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితం.

 Interesting Update On Ram Charans Rc15-TeluguStop.com

కానీ ఇప్పుడు అలా కాదు ట్రిపుల్ ఆర్ సినిమా ఈయనను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది.

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించాడు.

ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ అయ్యాడు.ప్రెజెంట్ అయితే చరణ్ లైనప్ ఇంట్రెస్టింట్ దర్శకులతో సాగుతుంది.ఈయన లైనప్ లో ఉన్న ఫస్ట్ డైరెక్టర్ ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్.

శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా ద్వారా శంకర్ ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

మరి ఆ మెసేజ్ ఏంటో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది.

రాజకీయాలకు సంబంధించి.మన ఓటు అమ్ముకుంటే.మన పిల్లల బంగారు జీవితాలను అమ్ముకున్నట్టే అనే లైన్ ను ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ ఎపిసోడ్ లో ఖుష్బూ నటించ బోతున్నట్టు టాక్.ఈ పాత్ర ద్వారానే ఈ మెసేజ్ ను ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకోగా.

దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube