ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు.వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించేందుకు ఆయన వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈనెల 19న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు.ఈ మేరకు బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
కాగా గతేడాది ప్రధాని మోదీ తెలంగాణకు నాలుగు సార్లు వచ్చారు.ఈ ఏడాది తొలి నెలలో మోదీ హైదరాబాద్ కు రానున్నారు.
మరోవైపు తెలంగాణలో అధికారం సాధించేందుకు బీజేపీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే ఈ సంవత్సరంలో మరిన్ని మోదీ సభలు ఉంటాయని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.







