టీడీపీలో చాలా మందికి చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు పదవులు పంచేశారు.అయితే ఇవన్నీ పార్టీ పదవులే.
వచ్చే ఎన్నికల వరకు టీడీపీ వాళ్లకు పార్టీ పదవులు మినహా చెప్పుకోవడానికేం లేవు.ఈ పదవులతోనే వారు మరో మూడున్నరేళ్ల పాటు పోరాటం చేయాలి.
ప్రజల్లో ఉండాలి.పార్టీని పటిష్టం చేయాలి.
ఆ తర్వాత వీళ్లలో ఎవరికి సీట్లు వస్తాయో ? ఎవరు గెలుస్తారో ? ఎవరు ఓడతారో ? అసలు అప్పటి వరకు పార్టీపై ప్రజల్లో నమ్మకం ఉంటుందా ? అన్న ప్రశ్నలకు ఆన్సర్లు లేవు.
ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా పంపిణీ చేసిన పదవుల పందేరంపై చాలా మంది ఈ పదవులు మాకెందుకు అని గుస్సాతో ఉన్నారట.
కేవలం తెలుగు తమ్ముళ్లే కాదు.తెలుగు చెల్లెమ్మల్లోనూ అదే ఆవేదన నెలకొందట.ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక మహిళా నేతలు చంద్రబాబు తీసుకున్న చర్యలతో విసిగిపోయినట్టు తెలుస్తోంది.మాజీ స్పీకర్ ప్రతిభా భారతిని కీలకమైన పొలిట్బ్యూర్ నుంచి తప్పించేసి.
ఆమెకు జాతీయ ఉపాధ్యక్షురాలు పేరిట పదవి ఇచ్చారు.
ఇప్పుడు దక్కిన పదవితో తనకు ఎంత మాత్రం ఉపయోగం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఈ క్రమంలోనే ప్రతిభా భారతి ఈ పదవి తనకు వద్దని ఆవేదనతో అధిష్టానానికి లేఖ రాశారట.ఇక ఇదే జిల్లాకు చెందిన తాజా మాజీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, గత ఎన్నికల్లో పలాస నుంచి పోటీ చేసి ఓడిపోయిన గౌతు శిరీష సైతం తనకు కూడా సరైన గౌరవం దక్కలేదని ఆవేదన చెందుతున్నారట.
ఆమెను ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడమే కాకుండా.కనీసం ఆమెకు సమాచారం కూడా ఇవ్వడం లేదట.ఏదేమైనా ఈ గొడవలు ఇప్పట్లో చల్లారేలా లేవు.మరి బాబు వీరిని ఎలా బుజ్జగిస్తారో ? చూడాలి.