షాకింగ్ ఘటన....బ్రాండెడ్ బ్యాగ్ కోసం భారతీయుడి హత్య...!!!

డబ్బు కోసమో, నగల కోసమో, ఆస్తుల కోసమో లేదంటే పగలు ప్రతీ కారాల కారణంగా ఒకరిని ఒకరు చంపుకునే ఘటనలు మనం ఎన్నో చూశాం.

కానీ కేవలం ఒక బ్యాగ్ కోసం కొందరు దుండగులు ఒక బాలుడిని చంపిన ఘటన బహుశా చరిత్రలో ఎక్కడా చూసి ఉండమేమో.

కేవలం బ్యాగ్ కోసం బాలుడిని చంపిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.వివరాలలోకి వెళ్తే.

బ్రాండెడ్ బ్యాగ్ కోసం భారత సంతతికి చెందిన బాలుడిపై కొందరు దాడి చేసి చంపేసిన ఘటన బ్రిటన్ లో కలకలం సృష్టించింది.ఈ ఘటనపై భారతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేయగా స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

అయితే ఇది కేవలం బ్యాగ్ నేపధ్యంలో జరిగిన హత్యా లేదంటే జాత్యహంకార హత్యా, అదీ కాకపొతే డబ్బు కోసం జరిగిన హత్యా అనే కోణంలో స్థానిక స్కాట్ల్యాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.భారతీయ సిక్కు సమాజానికి చెందిన ఓ కుటుంభం ఎన్నో ఏళ్ళ క్రితమే బ్రిటన్ లో స్థిరపడింది.

Advertisement

వారి కుటుంబానికి చెందిన 16 ఏళ్ళ అష్మిత్ సింగ్ స్థానికంగా ఉన్న స్కూల్ లో చదువుకుంటున్నాడు.అష్మిత్ సింగ్ వద్ద గుచ్చీ అనే ప్రఖ్యాత బ్రాండెడ్ కంపెనీకి చెందిన బ్యాగ్ ఒకటి ఉంది.

సదరు బ్యాగ్ ఖరీదు కంటే కూడా కంపెనీ బ్రాండ్ పై క్రేజ్ ఎక్కువట.ఈ బ్యాగ్ దొంగిలించే క్రమంలో అష్మిత్ సింగ్ ను దుండగులు చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

అతడిపై దాడి జరిగిన వెంటనే స్నేహితుల సమాచారం మేరకు హుటాహుటిన వైద్యులు వచ్చి పరీక్షించిన ఉపయోగం లేకపోయింది.ఈ దాడిలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

కాగా దుండగుల ఆచూకి కోసం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.ఈ ఘటనపై భారతీయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు