వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో టీమిండియా ఆటగాళ్లు..!

తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.

టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ లు ఇద్దరు మొదటి అగ్ర స్థానాలలో కొనసాగుతున్నారు.

ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలవగా.రెండో స్థానంలో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కొనసాగుతున్నారు.

వీరి తర్వాత పాకిస్థాన్ యువ సంచలనం బాబర్ అజామ్ మూడో స్థానానికి పరిమితం అయ్యాడు.వీరి తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్, ఆరోన్ ఫించ్ తర్వాతి స్థానాల్లో టాప్ 5 స్థానాల్లో ఉన్నారు.

ఇక బౌలర్స్ ర్యాంకింగ్ విషయంలో వస్తే న్యూజిలాండ్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ మొదటి స్థానంలో ఉండగా, ద్వితీయ స్థానాన్ని ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ కొనసాగుతుండగా మూడో స్థానాన్ని టీమిండియా పేసర్ జస్ప్రిత్ బూమ్రా ఉన్నాడు.ఆ తర్వాత ఇంగ్లాండ్  ఓక్స్ 4 వ స్థానంలో, సౌత్  ఆఫ్రికా ఆటగాడు రబడా ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు.

Advertisement

ఇక ఆల్ రౌండర్ల విషయాని కొస్తే టీమిండియా తరఫు నుంచి రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా టాప్ 20 లో ఉన్నారు.ఆల్ రౌండర్ల విషయానికి వస్తే బంగ్లాదేశ్ టీం మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మొదటి స్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నబి రెండో స్థానంలో ఉన్నారు.ఇక ఈ లిస్ట్ లో రవీంద్ర జడేజా 8వ స్థానానికి పరిమితం అవ్వగా, హార్దిక్ పాండ్యా 12వ స్థానానికి పరిమితం అయ్యాడు.

ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ టీం 123 రేటింగ్స్ తో మొదటి స్థానంలో కొనసాగుతుండగా.ఆ తర్వాత ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు