అమెరికాలో 16 భారతీయ ఎన్నారై లకి కరోనా...!!!

అమెరికాని కరోనా మేఘాలు పూర్తిగా కమ్మేశాయి.ప్రపంచాన్ని శాసించ గలిగే శక్తి ఉన్న అమెరికా ఇప్పుడు కరోనా గుప్పెట్లో కొట్టుమిట్టాడుతోంది.

అమెరికా ప్రజలు బహుశా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి ఉండరు.బయట కాలు పెట్టాలంటే భయపడిపోతున్నారు.

మరో పక్క రోజు రోజుకి కరోనా మృతి కేసులు పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా న్యూయార్క్ లో ఈ పరిస్థితి చేయి దాటిపోయిందనే చెప్పాలి.

ఇదిలాఉంటే మరోపక్క అమెరికాలో కరోన కారణంగా మృతి చెందుతున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది.రెండు రోజుల వరకూ 5గురు భారతీయ ఎన్నారైలు మృతి చెందగా నిన్నటి రోజుకి ఈ సంఖ్య 11 కి చేరుకుంది.

Advertisement

అంతేకాదు సుమారు 16 మంది ఎన్నారైలకి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారించారు అధికారులు.వీరందరినీ గుర్తించన అధికారులు ప్రస్తుతం వీరిని క్వారంటైన్ కి తరలించినట్టుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన ఎన్నారైలలో అందరూ మగవారేనని ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన కేసులలో సుమారు 10 మంది న్యూయార్క్ సిటీకి చెందిన వారు కాగా మిగిలిన వారు అమెరికాలోని వివిధ ప్రాంతాలకి చెందిన వారు గా తెలుస్తోంది.ఇదిలాఉంటే పాజిటివ్ కేసులలో సుమారు 4 గురు ఆడవారు ఉన్నట్టుగా ధ్రువీకరించారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు