ఆ ముగ్గురు హీరోలతో కలిసి డాన్స్ చేయాలని ఉంది... సాయి పల్లవి కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి సినిమాతోనే అందరిని ఫిదా చేసినటువంటి నటి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే.ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలుదొక్కుకోవాలంటే గ్లామర్ షో తప్పనిసరి అని ఎంతోమంది హీరోయిన్లు ఇలా గ్లామర్ షో చేస్తూ అవకాశాలు అందుకుంటూ ఉండగా సాయి పల్లవి మాత్రం ఎలాంటి గ్లామర్ షో లేకుండా ఎలాంటి స్టార్ హీరో అయినా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే నిర్మొహమాటంగా నో చెబుతూ కథ ప్రాధాన్యతగల చిత్రాలను ఎంపిక చేసుకుంటూ సినిమాలలో నటిస్తున్నారు.

ఇలా ఈమె నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయం అందుకోవడంతో అతి తక్కువ సమయంలోనే తెలుగు తమిళ భాషలలో నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే సాయి పల్లవి చివరిగా గార్గి సినిమా తర్వాత ఇప్పటివరకు ఎలాంటి తెలుగు సినిమాలకు కమిట్ అవ్వకపోవడంతో సాయి పల్లవి సినిమాలకు దూరమవుతున్నారా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది.ఇక సాయి పల్లవి సాధారణంగా ఇంటర్వ్యూలకు చాలా దూరంగా ఉంటారు.

అలాంటి సాయి పల్లవి తాజాగా నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ నేడు ప్రసారం కానుండగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా స్మిత సాయి పల్లవిని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన డాన్సర్ గా మీరు రామ్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ ఈ ముగ్గురితో కలిసి డాన్స్ చేసే అవకాశం వస్తే ముందుగా ఎవరితో చేస్తారు అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం చెబుతూ ఒకే పాటలోని ఈ ముగ్గురితో కలిసి డాన్స్ చేయాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు.ఇకపోతే గత కొంతకాలంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఈ విషయంపై మీటు ఉద్యమం కూడా జరిగింది.దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని స్మిత ప్రశ్నించగా అందుకు సాయి పల్లవి సమాధానం చెబుతూ.

ఎవరైనా మనల్ని శారీరకంగా ఇబ్బంది పెట్టడమే కాదు మాటల ద్వారా కూడా ఇబ్బంది పెట్టిన అది లైంగికంగా వేధించినట్లేనని ఈ సందర్భంగా సాయి పల్లవి చెప్పినటువంటి సమాధానం వైరల్ గా మారింది.

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?
Advertisement

తాజా వార్తలు