అతనికి ఐ లవ్ యు చెప్పిన శ్రీదేవి కూతురు.. నెట్టింట వైరల్?

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ "ధడక్" చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జాన్వికపూర్ ప్రస్తుతం "గుడ్ లక్ జెర్రీ" ఈ సినిమాలో నటిస్తున్నారు అదేవిధంగా ధర్మ ప్రొడక్షన్స్ లో దోస్తానా 2 లో కనిపించనున్నారు.

సినీ సెలబ్రిటీ కూతురిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వికపూర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ గత కొంతకాలం నుంచి తన చిన్ననాటి స్నేహితుడు అక్షత్ రాజన్ తో రిలేషన్ లో ఉందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మీడియా కంటపడటంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.తాజాగా తన ఫ్రెండ్ అక్షత్ రాజన్ పుట్టినరోజు కావడంతో తన స్నేహితుడుకి స్వీట్ విషెస్ చెబుతూ ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రపంచంలోనే బెస్ట్ హ్యూమన్ గా అక్షత్ ను వర్ణిస్తూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జాన్వీ కపూర్."ఐ లవ్ యు అక్షత్" అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో తన ప్రేమను వ్యక్తం చేస్తూ.అతని భుజం పై వాలిపోయి ఉన్నటువంటి ఫోటోను షేర్ చేసింది.

Advertisement

ప్రస్తుతం ఈపోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి మరోసారి వార్తలు షికార్లు చేస్తున్నాయి.గతంలో వీరిద్దరి గురించి వచ్చిన వార్తలపై స్పందించిన జాన్వీకపూర్ తన చిన్నప్పటి ఫ్రెండ్ అంటూ మా ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పిన జాహ్నవి ఇలా తన స్నేహితుడికి ప్రపోస్ చేయడంతో ఈ విషయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు