వావ్: హైదరాబాదు నగరానికి త్వరలో రాబోతున్న కంగారులు..!

కంగారులు గురించి మనకు తెలిసిందే.అవి పరిగెత్తడం చూస్తే ఎవరు అయినాసరే వారెవ్వా అని అనాలిసిందే.

అంత వేగంగా కంగారులు పరుగెత్తుతాయి.అలాగే ఈ కంగారులను ఆస్ట్రేలియా జాతీయ జంతువుగా కూడా పరిగణిస్తారు.

అక్కడ మనుషుల కంటే ఈ కంగారు జంతువులే ఎక్కువగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.అయితే ఆస్ట్రేలియా అడవుల్లో మాత్రమే మనకు కనిపించే ఈ కంగారూలు త్వరలోనే మన హైదరాబాద్‌ జూ పార్క్ లో కూడా సందడి చేయనున్నాయి.

మరో రెండు నెలల్లో నెహ్రూ జూలాజికల్ పార్కులో రెండు కంగారులు రానున్నాయని జూ పార్కు క్యూరేటర్​వీవీఎల్ సుభద్రా దేవి తెలిపారు.అయితే ఆ కంగారుల ఎన్‎క్లోజర్​ నిర్మాణ పనులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించడానికి దుండిగల్‌ లోని గ్లాండ్​ఫార్మా షూటికల్ లిమిటెడ్​ కంపెనీ ముందుకు వచ్చిందని తెలిపారు.

Advertisement

మూగ జీవాల పట్ల సానుకూలభావంతో ఫార్మా కంపనీ ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు సుభద్ర దేవి.ఇప్పటికే కంగారుల ఎన్‌క్లోజర్‌ నిర్మాణ పనుల నిమిత్తం రూ.20 లక్షల చెక్కును గ్లాండ్​ ఫార్మా లిమిటెడ్​ కంపెనీ బుధవారం జూ అధికారులకు అందచేసినట్లు తెలుస్తుంది.

ఈ సందర్భంగా జూ పార్కు క్యూరేటర్ వీవీఎల్​ సుభద్రా దేవి మాట్లాడుతూ ఇలా అన్నారు.జంతు మార్పిడి పథకంలో భాగంగా జపాన్‌ లోని ఓఖ్లాహామా జూపార్కు నుంచి నెహ్రూ జూలాజికల్​ పార్కుకు రెండు కంగారులు మరో రెండు నెలల్లో రాబోతున్నాయన్నారు.ఇవి జూ లోకి వచ్చిన తర్వాత వాటిని దత్తత తీసుకుంటామని ఫార్మా కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రఘురాం, పి.సంపత్, స్వాతి తో పాటు జూ డిప్యూటి క్యూరేటర్​ నాగమణి తదితరులు పాల్గొన్నారు.మరికొన్ని రోజుల్లో మనం అందరం కూడా జూ లో కంగారు జంతువులను చూడబోతున్నాం అన్నమాట.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు