తమిళస్టార్ డైరెక్టర్, హీరో అయిన లారెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.తెలుగు తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కాంచన’ చిత్రాన్ని అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో ఈయన రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.
సౌత్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కాంచనను హిందీలో లక్ష్మీ బాంబ్ అనే టైటిల్తో సినిమా రూపొందుతోంది.ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలను తుషార్ కపూర్ మరియు షాబిన్ ఖాన్ చూసుకుంటున్నారు.
అయితే వీరిద్దరు సినిమా విషయంలో జోక్యం చేసుకుంటున్నారంటూ లారెన్స్ ఆరోపిస్తున్నాడు.
తనకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించినప్పుడు అన్ని విషయాలు కూడా తాను అనుకన్నట్లుగా జరగాలి, తనకు తెలిసి జరగాలి.కాని తాజాగా సినిమా నుండి అక్షయ్ కుమార్ లుక్ను విడుదల చేశారు.ఆ విషయంను లారెన్స్కు తెలియజేయలేదట.
అందరితో పాటు లారెన్స్ కూడా సోషల్ మీడియాలో దాన్ని చూసి తెలుసుకున్నాడట.దాంతో లారెన్స్ చాలా హర్ట్ అయ్యాడట.
దాంతో సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించినట్లుగా తెలుస్తోంది.సినిమా సగం పూర్తి చేసిన లారెన్స్ ఇకపై తన వల్ల కాదని పక్కకు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
లారెన్స్ స్పందిస్తూ.తనకు అక్షయ్ కుమార్తో ఎలాంటి సమస్య లేదు.ఆయనపై చాలా గౌరవం ఉంది.కాని సినిమాలో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయ్యింది.దాన్ని నేను తట్టుకోలేక పోతున్నాను.అందుకే అక్షయ్ కుమార్పై గౌరవంతో స్క్రిప్ట్ను వారికి ఇచ్చేసి నేను తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు.
లారెన్స్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను ఎవరికి ఇవ్వాలనే ఆలోచనలో అక్షయ్ కుమార్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.మరి ఈ చిత్రంకు కొత్త దర్శకుడు ఎవరు వస్తాడు, ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.