పిడికిలి బిగించి మరి చెప్పారు.. మహా సముద్రం కంప్లీటెడ్..!

ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరక్షన్ లో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా మహా సముద్రం.

ఆరెక్స్ 100 తో డైరక్టర్ గా తన సత్తా చాటిన అజయ్ భూపతి ఈ సినిమాను కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

ర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరు పోటాపోటీగా ఈ సినిమాలో నటించారని తెలుస్తుంది.సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించారు.

కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తయిందని తెలుస్తుంది.సినిమా షూట్ పూర్తయిందని తెలియచేస్తూ చిత్రయూనిట్ ఒక క్రేజీ పోస్టర్ రిలీజ్ చేసింది.

అందులో శర్వానంద్, సిద్ధార్థ్ పిడికిలి బిగించి ఉన్నారు.మొత్తానికి మహా సముద్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.

Advertisement

సినిమా ఒక క్రేజీ లవ్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది.ఒకప్పుడు లవర్ బోయ్ ఇమేజ్ తో వరుస సూపర్ హిట్లు కొట్టిన సిద్ధార్థ్ ఈ సినిమాతో మరోసారి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

శర్వానంద్ కూడా మహా సముద్రం పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. అజయ్ భూపతి మాత్రం ఆరెక్ 100 సినిమాను మించి ఈ సినిమా కథను రాసుకున్నాడట.

ప్రేమ దృశ్య కావ్యంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు