విధవను ప్రేమించి వెధవనయ్యా.. కార్తికేయ కామెంట్స్ వైరల్..!

యంగ్ హీరో కార్తికేయ సినీ కెరీర్ లో ఆర్.ఎక్స్ 100 మినహా మరో హిట్ లేదనే సంగతి తెలిసిందే.

అయితే ఆర్.ఎక్స్ 100 సినిమాతో కార్తికేయ నటుడిగా మంచి పేరుతో పాటు గుర్తింపును సంపాదించుకున్నారు.ఆ గుర్తింపు వల్లే హిట్, ఫ్లాపులకు అతీతంగా కార్తికేయ ఆఫర్లను సంపాదించుకున్నారు.

బన్నీ వాసు నిర్మాతగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కిన చావుకబురు చల్లగా గత శుక్రవారం రోజున విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న స్టార్ట్ మ్యూజిక్ అనే షోకు గెస్టులుగా హాజరయ్యారు.

ఈ ఆదివారం ఎపిసోడ్ ప్రసారం కానుండగా తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.గత వారం విడుదలైన శశి, మోసగాళ్లు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకే ఎక్కువగా కలెక్షన్లు వస్తుండటంతో కార్తికేయ, లావణ్య త్రిపాఠి సినిమాను మరింత ప్రమోట్ చేయడానికి టీవీ షోలకు హాజరవుతున్నారు.

Advertisement

బస్తీ బాలరాజు పాటతో కార్తికేయ ఎంట్రీ ఇవ్వగా సుమ లావణ్యను ఈ అబ్బాయి నీ వెనక తిరుగుతున్నాడు ఏం చేయవా ? లావణ్య కార్తికేయ వెధవ అని అంటుంది.లావణ్య అలా అనడంతో కార్తికేయ విధవను లవ్ చేసి వెధవనయ్యాను అంటూ వెరైటీగా చెబుతారు.సినిమాలో లావణ్య భర్త చనిపోగా ఆమెను లవ్ చేసే పాత్రలో కార్తికేయ నటించారు.

సినిమాకు 13 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఫుల్ రన్ లో ఈ సినిమా సగం కలెక్షన్లను కూడా రాబట్టడం కష్టమేనని తెలుస్తోంది.చావుకబురు చల్లగా సినిమాతో సక్సెస్ సాధిస్తామని భావించిన కార్తికేయ, లావణ్యలకు ఈ సినిమాతో నిరాశతో కూడిన ఫలితమే ఎదురైంది.

ఈ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు