ఆర్-5 జోన్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో విచారణ

ఆర్ -5 జోన్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

రాజధానిలో ఇతర ప్రాంతాల వారికి స్థలాలు ఇచ్చేందుకు ఆర్ -5 జోన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు గవర్నర్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ను రైతులు హైకోర్టులో సవాల్ చేశారు.ఈ పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

రాజధాని మాస్టర్ ప్లాన్, ప్రణాళిక అభివృద్ధి, భూమిపై యాజమాన్య హక్కు వంటి అంశాలపై రైతుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.కాగా కోర్టు ప్రభుత్వం తరపు వాదనలు వినాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేసింది.

Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు