ప్రస్తుత రోజుల్లో కరోనా వైరస్ ఒకవైపు, మరోవైపు పని ఒత్తిడి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా మంది ప్రజలు.సమయానికి తినకపోవడం అలాగే పని ఒత్తిడి వల్ల కలిగే మానసిక ఒత్తిడి నిద్రలేమి మనం తినే ఆహారం వల్ల ఇలా ఎన్నో రకాలుగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది.
ఇటువంటి సమస్యలకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుందని కొంతమంది వైద్య నిపుణులు తెలుపుతున్నారు.అవేమిటో ఓసారి చూద్దామా…
ఇందులో భాగంగానే ఎండు ద్రాక్ష తీసుకోవడం ద్వారా శరీరానికి ఎదురయ్యే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా ఎండుద్రాక్షలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా పీచు పదార్థం అలాగే యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయి.దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందాలంటే మాత్రమే కాకుండా అనేక జీర్ణక్రియకు సంబంధించి అనారోగ్యాలను దూరం చేయగలరు.
వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా చిన్న పేగులలో ఉండే వివిధ పదార్థాలను బయటికి పంపించి వేస్తుంది.అంతే కాకుండా వీటి ద్వారా శరీరానికి ఎదురయ్యే విరేచనాలు, ఉదర సంబంధిత సమస్యలను దూరం చేయగలుగుతుంది.
వీటిని ముఖ్యంగా స్త్రీలు ఉపయోగిస్తే వారికి ఎంతగానో ఉపయోగపడతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.ముఖ్యంగా ద్రాక్ష పండ్లను ఎండబెట్టి ఎండుద్రాక్షలను తయారుచేస్తారు.ముఖ్యంగా వీటిని తీసుకోవడం ద్వారా క్రీడలు ఆడే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.వీటిని తీసుకోవడం ద్వారా రక్త కణాల ఉత్పత్తి ఎంతగానో మేలు చేకూరుతుంది.
ఎవరైనా పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే ఉంటే వారికి ఓ వారం రోజుల పాటు రెండు ఎండు ద్రాక్షలను ఇస్తే వారు పక్కతడపకుండా ఉంటారు.అలాగే ఎవరైనా గొంతు సమస్యలతో ఉన్నవారు ఎండు ద్రాక్షలు తీసుకుంటే ఎంతగానో ఉపశమనం పొందుతారు.
వీటి ద్వారా గొంతులో ఉండే కఫాన్ని ఇది తొలగిస్తుంది.