గుణశేఖర్‌ వీటిని వదిలేలా లేడుగా?

భారీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్‌ తాజాగా ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.

దాదాపు మూడు సంవత్సరాల పాటు ‘రుద్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కించాడు ఈ దర్శకుడు.

చివరకు రుద్రమదేవి చిత్రం గుణశేఖర్‌కు ఆర్థికంగా మరియు వృత్తి పరంగా కూడా సంతృప్తిని కలిగింది.‘రుద్రమదేవి’కి సీక్వెల్‌గా ‘ప్రతాప రుద్రుడు’ చిత్రాన్ని తెరకెక్కింబోతున్నట్లుగా ఇప్పటికే గుణశేఖర్‌ ప్రకటించాడు.

అందుకోసం స్టోరీ లైన్‌ సిద్దంగా ఉండగా, త్వరలో హీరో ఎంపిక చేసి, స్క్రిప్ట్‌ వర్క్‌ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.‘ప్రతాప రుద్రుడు’ తర్వాత మళ్లీ అదే జోనర్‌లో మరో సినిమా చేయాలని ఈ దర్శకుడు ఫిక్స్‌ అయ్యాడు.

గుణశేఖర్‌ తన సొంత బ్యానర్‌ గుణ టీం వర్క్స్‌లో తాజాగా ‘వీరాభిమన్యు’ టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడు.అభిమాన్యుడి గురించిన కథతో గుణశేఖర్‌ సినిమా చేస్తాడట.

Advertisement

అందుకోసం స్టోరీ లైన్‌ కూడా సిద్దంగా ఉందని చెబుతున్నారు.‘ప్రతాప రుద్రుడు’ పూర్తి అయిన తర్వాత ‘వీరాభిమన్యు’ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.

అయితే అందుకు చాలా సంవత్సరాలు సమయం పట్టే అవకాశాలున్నాయి.మహాభారతంలోని ఒక పార్ట్‌ను ‘వీరాభిమన్యు’గా గుణశేఖర్‌ చూపించనున్నాడు.

అర్జునుడి కొడుకు అభిమన్యుడు అనే విషయం తెల్సిందే.ఇలా వరుసగా పౌరాణిక చిత్రాలతో గుణశేఖర్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు