చదువులపై జీఎస్టీ భారాలు ఎత్తివేయాలి: ఎస్.ఎఫ్.ఐ.డిమాండ్.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం విద్యార్ధుల చదువులపై జీఎస్టీ పేరుతో విద్యార్ధులకు అవసరమైన వస్తువులపై భారాలు వేయడాని వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్.ఎఫ్.

ఐ.) డిమాండ్ చేస్తుంది.

విద్యార్థులు వాడే పెన్సీల్,ఇంకు,షార్ప్ నర్, రైటింగ్, డ్రాయింగ్, ప్రింటింగ్ మెటిరియల్,పెపర్ పల్ప్ లపై 12 % ,పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, చార్ట్, మ్యాప్ పేపర్లు, గాఫ్ పేపర్లు ,ఏక్సరరైజ్ నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్ పై 18 % జీఎస్టీ విధించి విద్యార్ధుల చదువులు మరింత భారంగా మోపుతున్నారు.దేశంలో ప్రభుత్వ విద్యను, పాఠశాలలు,కళాశాలలలో నిధులు పెంచకుండా విద్యార్ధుల చదువులు భారం కాకుండా చూడకుండా కేంద్రం విద్యార్థులు చదువుకునే చదువులపై భారాలు పెంచడం వల్లన మరింత ఎక్కువ మందిపై ఈ భారం పడుతుంది అని ఎస్.ఎఫ్.ఐ.భావిస్తుంది.సేవారంగం అయిన విద్యపై జీఎస్టీ భారాలు పెంచి బిజెపి విద్యారంగాన్ని కాస్ల్టీ చెస్తుందని వీరు నూతన విద్యావిధానం పేరుతో అందరికీ విద్యను ఉచితంగా ఎలా అందిస్తారు.? తక్షణమే విద్యపై జీఎస్టీ తగ్గించి భారీగా విధించిన ట్యాక్స్ శాతాన్ని రద్దు చేయాలని ఎస్.ఎఫ్.ఐ.డిమాండ్ చేస్తోంది.

వీడియో: స్కూల్ గర్ల్స్‌ను వేధించిన వ్యక్తి.. బెల్టుతో చితకబాదిన అమ్మాయిలు..
Advertisement

Latest Latest News - Telugu News