ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

నివాళులర్పించిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా :బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా,అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్స్ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్, టెక్స్టైల్ అండ్ జౌళి శాఖ ఏడీ సాగర్, డీవైఎస్ఓ రాందాస్,ఎల్డీఎమ్ మల్లికార్జున రావు, డీటీసీపీఓ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News