సాయి ధరమ్ తేజ్ తో గోపీచంద్ నెక్స్ట్ మూవీ ప్లాన్

ఈ సంక్రాంతి పండగకి క్రాక్ సినిమాతో గోపీచంద్ మలినేని సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

గోపీచంద్ విన్నర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రవితేజతో ఈ సినిమా చేశాడు.

మిగిలిన సినిమాల టాక్ ఏవరేజ్ గా ఉండటంతో క్రాక్ మూవీ కమర్షియల్ హిట్ కావడంతో కలెక్షన్స్ పరంగా ఇంకా స్పీడ్ పెంచింది.సాలిడ్ హిట్ తో మళ్ళీ ఊపులోకి వచ్చిన గోపీచంద్ మలినేనితో సినిమాలు చేయడం కోసం నిర్మాతలు ఇప్పటికే అడ్వాన్స్ లు ఇచ్చేసి స్లాట్ బుక్ చేసుకుంటున్నారు.

ఇక ఇప్పుడు ఈ దర్శకుడు కోసం యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు.గోపీచంద్ తో నెక్స్ట్ సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే అతనికి టచ్ లోకి వెళ్లి మంచి కథలు రెడీ చేయాలని కోరుతున్నారు.అయితే క్రాక్ సినిమా కంటెంట్ పరంగా కొంత వీక్ గా ఉన్న దానికి రవితేజ ఎనర్జీతో బలం తీసుకొచ్చాడు.

Advertisement

ఈ కారణంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇదిలా ఉంటే గోపీచంద్ మాత్రం తన నెక్స్ట్ సినిమాని మెగా హీరోతో ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

విన్నర్ సినిమాతో సాయి ధరమ్ తేజ్ డిజాస్టర్ ఇచ్చిన గోపీచంద్ ఈ సారి ఎలా అయినా కమర్షియల్ హిట్ ఇవ్వాలనే కసితో ఉన్నాడని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో సాయి ధరమ్ తేజ్ కి ఇప్పటికే ఒక స్టోరీ లైన్ కూడా వినిపించడం జరిగిందని, తేజ్ కి కూడా నచ్చడంతోఆ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఇప్పుడు గోపీచంద్ ఉన్నాడని టాక్.ప్రస్తుతం తేజ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

అందులో దేవాకట్టా దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒకటికాగా కొత్త దర్శకుడుతో ఫాంటసీ మూవీ ఒకటి చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే గోపీచంద్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

మరి అంత వరకు ఈ దర్శకుడు వెయిట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?
Advertisement

తాజా వార్తలు