మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్... రూ.549 ధరకే శాంసంగ్ ఎఫ్22 సొంతం చేసుకోండిలా

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా మొబైల్ ఫోన్స్ పై అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది.

అంతేకాదు, ఇది భారీ డిస్కౌంట్లు ప్రకటించి చాలా మొబైల్ ఫోన్స్ చాలా తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది.

అయితే ఈ డిస్కౌంట్లు, ఆఫర్లు కారణంగా వేలల్లో ఉన్న ఫోన్స్ వందల రూపాయిల్లోకి దిగి వచ్చాయి.వీటన్నింటిలో రూ.15 వేల ధర ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్ ఫోన్ అందర్నీ ఆకట్టుకుంటోంది.ఈ ఫోన్ ని మీరు ఇప్పుడు కేవలం రూ.549 కే ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సొంతం చేసుకోవచ్చు.మీరు దీన్ని ఇంత తక్కువ ధర కి ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం రూ.14,999 ధరకు సేల్ అవుతోంది.అయితే ఫ్లిప్‌కార్ట్ సంస్థ దీనిపై 20 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.దీంతో ఈ ధర రూ.3,000 డిస్కౌంట్ తో రూ.11,999కి దిగివచ్చింది.మీరు డిస్కౌంట్ తో పాటు బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా పొందవచ్చు.దీని వల్ల శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 ధర రూ.549కి తగ్గుతుంది.ఐడీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసి మీరు 10 శాతం డిస్కాంట్ పొందవచ్చు.

దీని వల్ల మరొక వెయ్యి రూపాయలు నీరు ఆదా చేసుకోగలుగుతారు.అలా ఫోన్ ధర రూ.10,999 కు తగ్గుతుంది.

ఇక మీరు మీ ఓల్డ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి గరిష్ఠంగా రూ.11,450 వరకు సేవ్ చేసుకోవచ్చు.ఒకవేళ ఐడీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు మీవద్ద లేకపోయినా మీరు డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు రూ.549కే సొంతం చేసుకోవచ్చు.మరిన్ని వివరాలకు ఫ్లిప్‌కార్ట్‌ అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

Advertisement
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

తాజా వార్తలు