కథలాపూర్ మండలం ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డాక్టర్ గోలి మోహన్!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) వేములవాడ నియోజకవర్గంలో కథలాపూర్ మండలం ప్రీమియం లీగ్ పీకే టోర్నమెంట్( Premium Cricket League Tournament ) ను ప్రారంభించిన డాక్టర్ గోలి మోహన్.

ఈ సందర్భంగా డాక్టర్ గోలి మోహన్( Goli Mohan ) మాట్లాడుతూ యువత ఆటలు చదువు ఉపాధి ద్వారా ముందుకు సాగాలని ఆటల ద్వార దేహదారుఢ్యంతో పాటు జ్ఞానం పెరుగుతుందని, ప్రతి వ్యక్తిలో మంచి ఆలోచనలు సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవుతారని అన్నారు.

క్రీడల ద్వార మాత్రమే దేనినైనా సాధించవచ్చు అని ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కుల మతాలకు తావు ఇవ్వకుండా ఉండేది ఏదైనా ఉంటే అవి ఆటలు మాత్రమేనని రాబోయే రోజుల్లో ఈ వేములవాడ నియోజకవర్గం లోని ప్రతి ఒక్క ఆటను ప్రోత్సహిస్తానని గ్రామ, మండలం జిల్లా రాష్ట్రం నుండి జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు.దాని కొరకు ఎల్లవేళలా ప్రతి క్రీడాకారునికి సహాయం అందిస్తానని యువత ఈ దేశానికి వెన్నుముక లాంటి వారిని మీరందరూ రాబోయే రోజుల్లో ఈ దేశానికి మార్గదర్శకులని గ్రామంలోని యువకులు అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు యువకులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News