ఏపీ కి వెళ్ళాలి.. కానీ పాస్ లేదు.. అతి తెలివితో ఏం చేశారో తెలుసా..?

ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో జిహెచ్ఎంసి పరిధిలో సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.

దీంతో అప్రమత్తమైన ఆంధ్ర ప్రదేశ్ వాసులు ప్రస్తుతం స్వస్థలాలకు పయనమయ్యారు.దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు బారులు తీరుతున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ చెక్ పోస్టుల వద్ద ఎంతగానో రద్దీ పెరిగింది.ఇక అనుమతి పత్రాలు ఉన్న వారిని కరోనా పరీక్షల్లో నిర్ధారణ కోసం నమూనాలు సేకరించిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కి అధికారులు అనుమతి ఇస్తున్నారు.

ఇక పాసులు లేని వారిని అక్కడే నిలిపివేస్తున్నారు అధికారులు.ఇలాంటి క్రమంలోనే సరిహద్దుల్లో కొంతమంది ప్రయాణికులు కాస్త అతి తెలివి ప్రదర్శించారు అనే చెప్పాలి.

Advertisement

అనుమతి లేని కార్లను సరిహద్దుల్లో అనుమతించకపోవడంతో కొందరు హైదరాబాద్ నుంచి సరిహద్దు వరకు కారులో వచ్చి ఆ తర్వాత కాలినడకన సరిహద్దులు దాటిన తర్వాత మరో కారులో వెళ్లేందుకు ప్రయత్నించారు.దీంతో పోలీసులు వారిని గుర్తించి వెనక్కి పంపించేశారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు