గుండెపోటుతో మాజీ ఉపసర్పంచ్ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: గుండెపోటుతో మేజర్ గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ మృతి చెందాడు.

ఎల్లారెడ్డిపేట కిషన్ దాస్ పేట కు చెందిన మాజీ ఉపసర్పంచ్ ఆడెపు భగవాన్ 72 మంగళవారం తన స్వగృహంలో తెల్లవారుజామున మూడున్నర గంటలకు గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన వెలుగు చూసింది.

మృతుడు ముందు రోజు అనారోగ్యానికి గురి కాగా ఆస్పత్రిలో చికిత్స పొంది మరుసటి రోజు గుండెపోటుకు గురయ్యాడని తెలిసింది.ఎల్లారెడ్డిపేట కు రెండు పర్యాయాలుగా ఉపసర్పంచ్ గా కొనసాగి తనదైన ముద్ర వేసుకున్నాడు.

గ్రామస్తులకు చేదోడువాదోడుగా ఉండి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి అని పలువురు అభిప్రాయపడుతున్నారు.భగవాన్ మృతి పట్ల గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

పార్తివదేహానికి పలువురు ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు.

Advertisement
ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News