రూ.8.33 కోట్లు కొట్టేయడానికి ఫేక్ లాటరీ క్రియేట్ చేశారు.. లాస్ట్ ట్విస్ట్ మాత్రం..?

ఫ్లోరిడాలో ఒక జంట లాటరీ( Lottery ) డబ్బు గెలుచుకోవడానికి మోసం చేయాలని ప్లాన్ చేశారు.కానీ వారి ప్రయత్నం విఫలం కావడంతో అడ్డంగా బుక్కయ్యారు.

వివరాల్లోకి వెళితే కిరా అండర్స్, ఆమె భాగస్వామి డకోటా జోన్స్ ఒక విన్నింగ్ లాటరీ టిక్కెట్‌ను క్లెయిమ్ చేయడానికి ఒక పథకాన్ని రూపొందించారు.వారు రెండు టిక్కెట్లను చింపి, ఒక టిక్కెట్ పై భాగాన్ని మరొక టిక్కెట్ దిగువ భాగంతో జాగ్రత్తగా కలిపి, ఒక "గెలుపు" టిక్కెట్‌ను సృష్టించారు.

వారి లక్ష్యం? భారీ మొత్తంలో డబ్బు దోచేయడం.మొత్తంగా రూ.8.33 కోట్లు.వారి టిక్కెట్‌పై ఉన్న సీరియల్ నంబర్లు సరిపోలలేదు.

ఫలితంగా, వారి మోసం బయటపడింది.వారు చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు.

Advertisement

మార్చి 1న, అండర్స్, జోన్స్‌ తమ ఫేక్ "గెలుపు" టిక్కెట్‌ను ఫ్లోరిడాలోని పెన్సాకోలాలోని లాటరీ కార్యాలయంలో సమర్పించారు.కానీ దురదృష్టవశాత్తు, అధికారులు వెంటనే వారి టిక్కెట్ "ఫేక్"( Fake Lottery Ticket ) అని నిర్ధారించారు.

అదెలాగంటే వారు రెండు వేర్వేరు స్క్రాచ్-ఆఫ్ టిక్కెట్లను కలిపి మోసం చేసినప్పుడు, వారు సీరియల్ నంబర్లను తనిఖీ చేయడం మరచిపోయారు.మార్చి 7న అండర్స్ టిక్కెట్ స్టేటస్ గురించి ప్రత్యేక ఏజెంట్ రిచర్డ్ పిసాంటికి ఫోన్ చేసింది.పిసాంటి ఆమెను మార్చి 11న ఫ్లోరిడా లాటరీ కార్యాలయాన్ని( Florida Lottery Office ) సందర్శించమని సూచించాడు.

అండర్స్ జోన్స్‌తో కలిసి వచ్చినప్పుడు, వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ కోసం వేరు చేశారు.టిక్కెట్ గురించి తెలిసిపోయింది అని అర్థం చేసుకున్న ఆ మోసగాళ్లు పరిస్థితి మరింత దిగజారకుండా ప్రవర్తించాలని భావించారు.

రెండు టికెట్లకు టేప్ అంటించానని అండర్స్ చెప్పింది.

ఈటెల ఆ పదవి కన్నేశారా ? అసంతృప్తితో రగిలిపోతున్నారా ?
పవన్ కళ్యాణ్ ఆ సినిమా పై ఫోకస్ చేసిన అకీరా... ఆత్రుతగా ఉందంటూ?

చివరికి, అండర్స్, జోన్స్ తమ మోసపు స్కీమ్‌ను( Lottery Scam ) అంగీకరించారు.గెలుపొందిన డబ్బును పంచుకుని, ఆ డబ్బుతో బ్యూటీ పార్లర్ తెరవాలని ప్లాన్ చేశామని అండర్స్ ఒప్పుకుంది.ఈ జంట ఏప్రిల్ 19న రూ.16,65,907 (అండర్స్), రూ.14,57,668 (జోన్స్) బాండ్లు చెల్లించిన తర్వాత విడుదలయ్యారు.తమ అక్రమ లాటరీ కుంభకోణానికి ఫలితంగా వారు మే 10న కోర్టులో హాజరు కావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు