తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి( Nitish Kumar Reddy ), ఇటీవలి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (BGGT) సిరీస్లో తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు.ఆస్ట్రేలియాతో జరిగిన ఈ సిరీస్లో తన బౌలింగ్, బ్యాటింగ్ నైపుణ్యాలతో అదరగొట్టిన అతడు తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాడు.
ఇందుకు సంబంధించి నితీశ్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
ఇందులో అతను తిరుమల మోకాళ్ల పర్వతం వద్ద కాలినడకన స్వామివారి దర్శనానికి వెళ్ళే దృశ్యాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇకపోతే, నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో తన ప్రతిభతో ప్రత్యేకంగా నిలిచాడు.
నితీష్ 171 బంతుల్లో టెస్టు కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు.మెల్బోర్న్లో( Melbourne ) 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నితీశ్, తొలిసారి బౌలర్లకు అవకాశాన్ని ఇవ్వకుండా తన స్థిరమైన బ్యాటింగ్తో జట్టును ఫాల్ ఆన్ పరిస్థితి నుంచి బయటపడేసాడు.ఈ సిరీస్లో నితీశ్ 37.25 సగటుతో 298 పరుగులు సాధించి భారత తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
సిరీస్లో ఐదు టెస్టులలో 5 వికెట్లు సాధించి బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు.ఇక, ఆస్ట్రేలియాతో( Australia ) పర్యటన ముగించి స్వస్థలమైన విశాఖకి తిరిగి వచ్చిన నితీశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో అతన్ని ఉత్సాహంగా అభినందిచారు.ఆ సమయంలో నితీష్ తో చాలామంది అభిమానులు ఆటోగ్రాఫ్లు, ఫొటోలు తీసుకున్నారు.స్వాగతం అనంతరం, నితీశ్ ఇంటికి ఓపెన్ టాప్ వాహనంలో వెళ్లిపోయాడు.ఇప్పుడు, నితీశ్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రపంచంలో తన ప్రతిభతో మాత్రమే కాకుండా.
భక్తి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడంతో మరింత క్రేజ్ ను సుసంపాదించుకున్నాడు.ఇక ఇంగ్లాండ్ తో జరగబోయే సిరీస్ కు నితీష్ కుమార్ ఎన్నికైన సంగతి తెలిసిందే.