ప్రముఖ సీరియల్ నటికి కరోనా.. త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ట్విట్?

భారతదేశంలో కోవిడ్ మహమ్మారి మరోసారి కోరలు చెపుతోంది.ఇప్పటికే చాపకింద నీరులా పాకిపోతున్న ఈ మహమ్మారి బారిన ఎంతోమంది పడ్డారు.

ఇలా సాధారణ ప్రజల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు సైతం ఈ మహమ్మారి బారిన పడి కోలుకుంటున్నారు.ఇదిలా వుండగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రెటీలు కరోనా బారిన పడ్డారు.

తాజాగా బుల్లితెర నటి, మధుబాల సీరియల్ ఫేమ్  ద్రష్టి ధామికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.ఈ విషయాన్ని ఈమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

నటించిన ది ఎంపైర్‌ వెబ్ సిరీస్‌ను వీక్షిస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ నేను మూడో వేవ్‌తో పోరాడుతున్నప్పుడు కొన్ని మంచి విషయాలు మాత్రమే నాకు తోడుగా ఉన్నాయి నేను ప్రస్తుతం లిల్లి పువ్వుల వాసనను పసిగట్ట గలుగుతున్నాను.

Advertisement

ట్విక్స్‌ చాక్లెట్‌ రుచిని ఎంజాయ్‌ చేయవచ్చు.ఈ అదృష్టాన్ని లెక్కపెడుతూ ప్రేమ, మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తాను.అని పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ పై కరిష్మా తన్నా, కరణ్‌ వి గ్రోవర్‌, పలువురు స్పందిస్తూ తాను కరోనా మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవాలని కామెంట్లు చేశారు.

ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ కపూర్‌, కరీనా కపూర్‌, నోరా ఫతేహీ, జాన్ అబ్రహం ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు