ఇదేందయ్యా ఇది : ఈ బాబా కొరికినా, తన్నినా పిల్లలు పుడుతారట...

ఈమధ్య కాలంలో కొందరు బాబాలు అమాయకుల సమస్యలను అలుసుగా తీసుకుంటూ బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.

కాగా తాజాగా ఓ బాబా సంతానం లేనటువంటి మహిళలను కొరికితే సంతానం కలుగుతుందని అలాగే అతడి పాద స్పర్శ తగిలితే కూడా పిల్లలు పుడతారని తెలియడంతో అమాయకపు జనం దొంగ బాబా దగ్గరికి క్యూ కడుతున్న ఘటన సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా పరిసర ప్రాంతంలో రామిరెడ్డి అనే బాబా ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నారు.కాగా ఈ రామిరెడ్డి బాబా కొద్ది రోజుల క్రితం ఓ నవ జంటను ఒంటిపై కొరకడంతో వారికి పిల్లలు జన్మించారని పలు పుకార్లు వినిపించాయి.

దీంతో సంతానం లేనటువంటి జంటలు రామిరెడ్డి సంప్రదిస్తూ అదేపనిగా ఒంటిపై పంటి గాట్లు పెట్టించుకుంటున్నారు.అయితే ఈ రామిరెడ్డి బాబా లీలలు అంతటితో ఆగలేదు.

ఏకంగా ప్రమాదంలో గాయపడిన పేషెంట్లు అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా తన వైద్య చేష్టలతో పరితపింపచేస్తున్నాడు.దీంతో రామిరెడ్డి బాబా పంటిగాటు మరియు పాద స్పర్శ కోసం దాదాపుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు.

Advertisement

దీంతో మెయింటినెన్స్ ఛార్జీల కోసమై రామిరెడ్డి బాబా ఒక్కొక్కరితో దాదాపుగా 200 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నాడు.దీంతో రామ్ రెడ్డి బాబా సంపాదన రోజురోజుకి బాగానే పెరుగుతోంది.

అంతేగాక ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ చేస్తూ ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.

దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ మధ్యకాలంలో సాంకేతికపరంగా దేశం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కొందరి ప్రజలకు మాత్రం మూఢనమ్మకాలపై ఉన్నటువంటి విశ్వాసం కారణంగా రోజు రోజుకి వెనకబడి పోతున్నారని అంటున్నారు.మరికొందరైతే ప్రజలు మ్యాజిక్కులను నమ్ముతారు కానీ రియాలిటీని అస్సలు నమ్మరని అందువల్లనే భారతదేశంలో ఎన్నో ప్రయోగాలు, అధ్యయనాలు చేసి అసలు నిజాన్ని కనుగొన్న సైంటిస్టులు కంటే ఇలాంటి బాబాలు బాగా ఫేమస్ అని అంటున్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు