మృతి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ప్రెషియ ప్రకటించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్మికుడిగా పనిచేస్తున్న గసిగంటి పోచయ్య గురువారం ప్రమాదవశాత్తు ట్రాక్టరు పై నుంచి పడి మృతి చెందాడు.

అయితే మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున 10 లక్షల ఎక్సిగ్రేషియా అందించాలని సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గ్రామపంచాయతీ & ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరారు.కార్యక్రమంలో జిల్లాలోని పలువురు గ్రామపంచాయతీ కార్మికులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా మాజీ ప్రధాని పివినరసింహారావు జయంతి వేడుకలు

Latest Rajanna Sircilla News