కేసీఆర్ కు దిమ్మ తిరిగిపోయే వార్నింగ్ ఇచ్చిన ఈటెల... అదేంటంటే?

కేసీఆర్ కు ఈటెలకు మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది.

భర్తరఫ్ అనంతరం కేసీఆర్ పై ఆగ్రహం ఉన్న ఈటెల కేసీఆర్ కు చెక్ పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడని చెప్పవచ్చు.

ఇప్పటికే ఇతర పార్టీల సీనియర్ నాయకులతో కూడా భేటీ అయి సలహాలు సూచనలు స్వీకరించారు.అయితే నియోజకవర్గంలో ఈటెలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని గమనించిన ఈటెల నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులపై తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది.

అయితే తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈటెల కేసీఆర్ పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చాడని చెప్పవచ్చు.కేసీఆర్ ఆటలు ఇక్కడ కుదరవని, హుజురాబాద్ నియోజకవర్గం కక్షలకు, పగలకు, ప్రకతీకారాలకు అతీతంగా ఉంటుందని, ఇక్కడి ప్రజలకు ఈటెల రాజేందర్ ఏంటో తెలుసని, ఎక్కడి నుండో ఎవరో వచ్చి ఇక్కడి రాజకీయలలో కలగజేసుకుంటే భవిష్యత్ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఈటెల తెలిపారు.

దీంతో కేసీఆర్ డైరెక్షన్ లో  గంగుల వేస్తున్న అడుగులకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది.ఏది ఏమైనా ఇప్పటికే మెజార్టీ వర్గం ఈటెల వైపు వెళ్తున్న తరుణంలో టీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇంకా ఎంత మంది నాయకులు ఈటెల వైపు వెళ్తున్నారనేది ఆసక్తిగా మారింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు