జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ?

ఎన్నడు ఆగుతుందో తెలియదు ఉగ్రవాద యుద్ధం.ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు రావణ కాష్టం.

ఇది భారతదేశాన్ని కాపాడే సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న భీకర పోరాటం.అనుక్షణం అప్రమత్తంగా ఉండటం వల్ల ఈ మాత్రం భరత మాత చల్లగా ఉంది.

లేదంటే రక్తసిక్తంతో తడిసి ముద్ద అవుతుంది.ఇలా అవడం లేదంటే దేశం కోసం సైనికులు ఆర్పించే ప్రాణాలే కారణం.

ఇకపోతే తాజాగా జమ్ముకాశ్మీర్‌ షోపియాన్​ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారట.ఈ మేరకు షోపియాన్ జిల్లాలోని హదిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించాయట.

Advertisement

,/br> ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై ఎదురుకాల్పులకు పాల్పడగా, జవానులు కూడా ఆత్మరక్షణార్ధం చేసిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందగా ఈరోజు తెల్లవారు జామున మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారిక సమాచారం.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు