ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా శ్రీనివాస్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మండల కేంద్రానికి చెందిన పందిర్ల శ్రీనివాస్ గౌడ్ ను నియమించినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసిన వారి అందరికీ సముచిత గౌరవం దక్కుతుందని అన్నారు.

అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనపై నమ్మకంతో అధికార ప్రతినిధిగా బాధ్యతలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రజలకు తమ సేవలను అందిస్తామని తెలిపారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News