మహేష్ బాబు ఇంట్లో చేసే పనులు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే.

ఈయన సీనియర్ నటుడు కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న మహేష్ బాబు తన వృత్తిపరమైన జీవితానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో తన వ్యక్తిగత విషయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.ఈ క్రమంలోనే తాను షూటింగుల కోసం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తనతో పాటు తన భార్య పిల్లలను కూడా వెంట తీసుకువెళ్తారనే విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా మహేష్ బాబు దంపతులు నిత్యం వెకేషన్ కి వెళుతూ కుటుంబంతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.ఇక మహేష్ బాబు నిత్యం సినిమాలతో బిజీగా ఉంటే తన పిల్లల బాధ్యతలను కుటుంబ బాధ్యతలను నమ్రత ఎంతో చక్కగా నిర్వర్తిస్తారు.

అదేవిధంగా మహేష్ బాబు సినిమాల గురించి కూడా ఈమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.తాజాగా మహేష్ బాబు బాలకృష్ణ టాక్ షోలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

Advertisement

ఈ కార్యక్రమం ద్వారా మహేష్ బాబు నమ్రత గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్ళాలని ప్లాన్ చేసిన తర్వాత పొరపాటున క్యాన్సిల్ అయితే గౌతమ్ కామ్ గా ఉంటారని, సితార మాత్రం అసలు ఊరుకోదు.చెప్పిన మాట ఏ మాత్రం వినదని తనకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తుందని చెప్పుకొచ్చారు.ఇక పిల్లల పూర్తి బాధ్యతలను నమ్రత చూసుకుంటుందని వారి చదువులు, మార్కులు వంటి విషయాల గురించి పట్టించుకోను అవన్నీ కూడా పూర్తిగా నమ్రత చూసుకుంటుందని ఈ సందర్భంగా మహేష్ బాబు తెలియజేశారు.

ఒకవేళ తన మాట వినని పక్షంలో తనకు చెబుతుందని నేను కూడా భయపెట్టినట్లు బెదిరిస్తాను తప్ప వాళ్లు నాకు భయపడరని మహేష్ బాబు ఈ షో ద్వారా తెలియజేశారు.ఇక షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చామా.పిల్లలతో సరదాగా గడిపామా.

పడుకున్నానా.అదే నా పని అని మహేష్ బాబు ఈ సందర్భంగా తాను ఇంట్లో ఏం పని చేస్తారో తెలియజేశారు.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

ఇలా మహేష్ బాబు కేవలం సినిమాలకు అంకితం అయితే ఇంటి బాధ్యతలు మొత్తం తన భార్య చూసుకుంటుందని ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు.ఇక ఈయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.

Advertisement

ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు పాల్గొంటారు.తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

తాజా వార్తలు