తంగళ్ళపల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కులను శనివారం ప్రజాప్రతినిధులు కలిసి 11మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆడపిల్లలకు ఆసరా నిలిచిందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి అందరికీ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగేల మానస రాజు, సర్పంచ్ అంకారపు అనిత రవీందర్,ఎంపీటీసీ అంతయ్య, బిఆర్ఎస్ నాయకులురాజన్న జగన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News