అక్కినేని ఫ్యామిలీ మరో మల్టీస్టారర్.. దర్శకుడెవరంటే..?

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కాంబినేషన్ లో అక్కినేని కుటుంబం అంతా మనం సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కి 2014లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అక్కినేని కుటుంబానికి ఈ సినిమా మరపురాని చిత్రంగా మిగిలింది.నాగార్జున ఇప్పటికీ ఇంటర్వ్యూల్లో మనం సినిమా తన కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా అని చెబుతూ ఉంటారు.

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ రాబోతుందని తెలుస్తోంది.ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ నటించనున్నారని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు మొదలయ్యాయని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

Advertisement

నాగార్జున ఇద్దరు కుమారుల్లో నాగచైతన్య హీరోగా సక్సెస్ కాగా అఖిల్ ఇప్పటికీ సరైన సక్సెస్ లెక కెరీర్ విషయంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు.గత కొంతకాలంగా నాగార్జున నటించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు. రాహుల్ రవీంద్రన్ చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ అంటే అక్కినేని ఫ్యామిలీ అభిమానులకు పండగ లాంటి వార్త అనే చెప్పాలి.నాగార్జున రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో మన్మథుడు 2 అనే సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ ఫలితాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ సినిమా ఫ్లాప్ అయినా రాహుల్ టాలెంట్ ను నమ్మి నాగార్జున మరో ఛాన్స్ ఇస్తున్నారని సమాచారం.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు