దాసరి తప్పు ఒప్పుకున్నాడు

దర్శకరత్న దాసరి నారాయణ రావు మెడకు బొగ్గు ఉచ్చు బలంగా బిగించుకు పోయింది.ఈనెల 22న దాసరి నారాయణ రావు కోర్టు ఎదుట హాజరు కావాల్సిన పరిస్థితి.

ఈ వరుస షాక్‌ల నేపథ్యంలో తాను రాజకీయాల్లోకి వెళ్లి పెద్ద తప్పు చేశాను అంటూ తాను చాలా కాలం క్రితం చేసిన తప్పును ఒప్పుకున్నాడు.50 సంవత్సరాలుగా తెల్ల డ్రెస్‌లు వేసుకుని, తెల్లటి మనస్సును కలిగి ఉన్న నాకు ఇలాంటి అభాండం వేయడం చాలా బాధాకరం అంటూ దాసరి ఆవేదన వ్యక్తం చేశాడు.రాజకీయ నాయకుల క్రీడకు తాను బలి అయ్యాను అని, ఎవరినో ఒడ్డున పడేసేందుకు నన్ను ముంచేశారు అంటూ దాసరి ఆవేద వ్యక్తం చేశాడు.

తన రాజకీయ ప్రత్యర్థులు తనపై బురద కాకుండా ఏకంగా తారునే పోశారు అంటూ దాసరి అన్నాడు.ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను నా మన్నసాక్షిగా ఏ తప్పు చేయలేదు అని తన అభిమానులకు మరియు సన్నిహితులకు చెబుతున్నాను అంటూ దాసరి చెప్పుకొచ్చాడు.

దాసరి వ్యాఖ్యలకు సినీ వర్గాల వారు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు.ఆయన మానసిక క్షోభను అనుభవిస్తున్నారు అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

వీడియో: సరదా కోసం నదిలోకి దిగిన యువతి.. మొసలి ఉండటంతో..??
Advertisement

తాజా వార్తలు