హాఫ్ నాలెడ్జ్ తో విమర్శలు చేస్తున్నారు.. : మంత్రి హరీశ్ రావు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు అద్భుతంగా అందుతున్నాయని చెప్పారు.

తెలంగాణ వచ్చాక నిమ్స్ లో సౌకర్యాలు పెరిగాయని తెలిపారు.ఎన్నో రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామన్న మంత్రి హరీశ్ రావు నిమ్స్ లో రాజకీయ ప్రమేయం లేకుండా చేశామని పేర్కొన్నారు.

ప్రస్తుతం గొప్ప గొప్ప డాక్టర్లు నిమ్స్ లో పని చేస్తున్నారని తెలిపారు.కానీ హాఫ్ నాలెడ్జ్ తో కొంతమంది విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.కొంతమంది మంచిని చూడరు, అభివృద్ధిని చూడరంటూ ఎద్దేవా చేశారు.

Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు