కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.తాను ఎవరికీ బానిస కాదని…ఎవరికీ లాలూచీ పడనని చెప్పారు.
పేదోడికి మేలు జరుగుతుందంటే ఎవరినైనా ఎదిరిస్తానని తెలిపారు.
కేసీఆర్ కిట్ వల్ల చాలా మందికి ప్రయోజనం చేకూరుతోందని జగ్గారెడ్డి అన్నారు.
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లు కూడా మంచి పథకాలని తెలిపారు.ఆ స్కీమ్ ల డబ్బులు పెంచితే బాగుంటుందని చెప్పారన్నారు.
అదేవిధంగా పేదలకు స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వానికి చెప్పానని తెలిపారను.రాష్ట్రంలో బీజేపీ ఎన్ని గేమ్స్ ఆడినా అధికారంలోకి రాదని వెల్లడించారు.
రాహుల్ గాంధీపై విమర్శలు చేసే నైతికత ఎవరికీ లేదని స్పష్టం చేశారు.