గ్రామపంచాయతీ సిబ్బందికి రెయిన్ కోట్ అందజేసిన.. కాంగ్రెస్ నాయకులు దయ్యాల రాజశేఖర్ ..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) బోయినిపల్లి మండలం తడగొండ గ్రామపంచాయతీ సిబ్బందికి సోమవారం కాంగ్రెస్ నాయకులు దయ్యాల రాజశేఖర్ రెయిన్ కొట్స్ అందజేశారు .

అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామామములో నిత్యం ఎండాకు, వానకు సేవ చేస్తూ వారి కర్తవ్యంని సక్రమంగా నిర్వహిస్తూ ఊరిని పరిశుభ్రంగా ఉంచుతూ గ్రామ ప్రజల ఆరోగ్యమే తమ ఆరోగ్యంగా భావిస్తూ పని చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది కీ రెయిన్ కోట్ అందజేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి రమేష్ , కార్యదర్శి మల్లేష్, మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ ,కారోబార్ చేలిమల్ల బాబు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల సహకారంతో స్టాఫర్ల ఏర్పాటు

Latest Rajanna Sircilla News